Site icon Sri Yadadri Vaibhavam

యాదాద్రీశా ఏమిటీ ఈ గోస

నాడు మహిమాన్విత యాదగిరి క్షేత్రం

నేడు యాదాద్రిగా ప్రపంచ పర్యాటక కేంద్రం

యాదగిరిగుట్ట పునర్నిర్మాణ చరిత్ర పై ఓ ప్రత్యేక వ్యాసం…!!

(శ్రీపాద శివ ప్రసాద్, కవి, విమర్శకులు సెల్ 897 8835919)

*1) కృత.. త్రేతా.. ద్వాపర.. కలియుగాల సమ్మిళితమైన చరిత్ర కలిగి.. విభండక మహర్షి పౌత్రుడు.. శాంత, రుష్యశృంగుల పుత్రుడు అయిన యాద మహర్షి తపోఫలితంగా మహా మహిమాన్వితమై.. జ్వాలా.. ఉగ్ర.. గండబేరుండ.. యోగానంద.. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గా పంచరూప నారసింహక్షేత్రంగా ఉద్భాసితమై విరాజిల్లుతున్నది ఈ యాదగిరిగుట్ట దేవాలయం.

యాదాద్రి లో కొలువుదీరిన యాదాద్రీషుడు

శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని తదేక దీక్షతో, మండల ప్రదక్షిణలతో లక్షలాదిమంది భక్తులు దీర్ఘకాలికమైన శారీరక, మానసిక రుగ్మతలను తొలగించుకోవడం ఈ దేవాలయం ప్రాశస్త్యం.

యాదాద్రి కొండపై నిర్మాణం పూర్తి చేసుకున్న తూర్పు రాజగోపురం
నిర్మాణం జరుపుకున్న భక్తులు (ఫైల్)
నూతనంగా నిర్మాణమైన ఔటర్ ప్రాకారం

ఐనా..!? ఐదేండ్ల కాల పరిమితి కలిగిన ప్రభుత్వాల వ్యవస్థలు, మన ప్రజాస్వామ్య క్షేత్రంలో మత సంబంధమైన దేవాలయాలను సంపూర్ణంగా నిర్మించాలనుకోవడమే వెర్రితనం. లేదా వ్యక్తిగత పేరు ప్రఖ్యాతులపై అత్యాశాతనం.

దక్షిణములోని ప్రాకారం…

దేవుళ్లపైన జనాలకున్న బలహీనతలను ఆసరా చేసుకొని ఏండ్లకు ఏండ్లు సమయం పట్టే దేవాలయాల నిర్మాణాలపై పెట్టుబడులను పెట్టడమనేది..!? ప్రజలను నిట్టనిలువునా దగా చేయడమే ఔతుంది. ముందుగానే మోసం చేద్దామని పాలకులు నిర్ణయించుకుంటారు కాబట్టి, ఆ తర్వాత ఎంతటి దేవుడైనా సరే మూగగా రోదించకతప్పని పరిస్థితులు ఏర్పడతాయి. ఇక మామూలు జనాల స్థితిగతులు ఎలా ఉంటాయో చెప్పనవసరం లేదు.

నూతనంగా నిర్మాణం పూర్తి చేసుకున్న తూర్పు రాజగోపురం (ఫైల్)

* 28) అత్యాశలను కూర్చిపేర్చిన సుదూర లక్ష్యం ఏమిటంటే…!? ఒకనాడు ఆధ్యాత్మిక క్షేత్రంగా, మహామహిమాన్వితమైన యాదగిరి గుట్ట దేవాలయ ప్రాంతం.. రాబోయే కాలంలో‌ కార్పోరేట్ బిజినె టైకూన్స్ కోరుకునేలా.. ఆర్థిక లావాదేవీలతో కూడిన ప్రపంచ పర్యాటక వ్యాపార కేంద్రంగా, ఎన్నో టూరిజం స్పాట్ ల మాదిరిగా ఈ యాదాద్రి ప్రాంతం మారబోతుందనేది అక్షరాల సత్యం.

శ్రీపాద శివప్రసాద్
Exit mobile version