తెలంగాణలో ఓటర్ల జాబితా అవకతవకలపై విచారణను హైకోర్టు ఈనెల 31కి వాయిదా వేసింది. శుక్రవారం విచారణలో భాగంగా బూత్ లెవల్ ఓటర్ల జాబితాపై అఫిడవిట్ను కోర్టులో ఈసీ దాఖలు చేసింది. దీంతో అఫిడవిట్ ప్రకారమే ఓటర్ల జాబితా ఉండాలని హైకోర్టు ఆదేశిస్తూ తదుపరి విచారణను 31కి వాయిదా వేసింది.