రెండో టెస్టులో రెండో ఇన్నింగ్స్లో విండీస్ తడబడుతోంది. టీమిండియా కట్టుదిట్టమైన బౌలింగ్కు విండీస్ స్వల్ప వ్యవధిలో రెండు వికెట్లను చేజార్చుకుంది. 36.6 ఓవర్లో జడేజా వేసిన బంతిని హోల్డర్(19; 30బంతుల్లో 2×4,1×6) పంత్కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. మరోవైపు క్రీజులో కుదురుకున్న సునిల్ ఆంబ్రిస్(38; 95 బంతుల్లో 4×4) జడేజా వేసిన బంతికి ఎల్బీగా వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో వారికన్(0), దేవేంద్ర బిషూ ఉన్నారు. 38 ఓవర్లు పూర్తయ్యేసరికి విండీస్ ఎనిమిది వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది.
స్వల్ప వ్యవధిలో రెండు వికెట్లు
