తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మరియు సభ్యులను ఇవాళ ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు నియమించారు. ముఖ్యమంత్రి ప్రతిపాదనల మేరకు గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ ఆమోదించారు.
చైర్మన్ గా డా. బి. జనార్ధన్ రెడ్డి (ఐఎఎస్) (వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శిగా ప్రస్తుతం పనిచేస్తున్నారు ). సభ్యులుగా శ్రీ రమావత్ ధన్ సింగ్ (బిటెక్ సివిల్, రిటైర్డ్ ఈఎన్సి), ప్రొ. బి. లింగారెడ్డి (ఎమ్మెస్సీ పి.హెచ్.డి., ప్రొ. హెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్ సిబిఐటి), శ్రీమతి కోట్ల అరుణ కుమారి (బిఎస్సీ, బీఈడీ, ఎంఎ, ఎల్.ఎల్.బి, స్పెషల్ గ్రేడ్ డిప్యూటి కలెక్టర్), శ్రీమతి సుమిత్రా ఆనంద్ తనోబా (ఎంఎ తెలుగు, తెలుగు పండిట్ ), శ్రీ కారం రవీందర్ రెడ్డి (బికాం, రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి), శ్రీ ఆరవెల్లి చంద్రశేఖర్ రావు (బి.ఎ.ఎమ్.ఎస్ (ఉస్మానియా), ప్రాక్టీసింగ్ ఆయుర్వేదిక్ డాక్టర్), శ్రీ ఆర్. సత్యనారాయణ (బిఎ, జర్నలిస్ట్) లను సీఎం నియమించారు.
ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ ను సీఎం ఆదేశించారు.