హైద‌రాబాద్ చేరుకున్న స్పుత్నిక్ వి వ్యాక్సిన్లు

0
47

హైద‌రాబాద్‌: క‌రోనా టీకాల‌కు కొర‌త ఉన్న దేశానికి ఇది కాస్త ఊర‌ట క‌లిగించే విష‌యం. ర‌ష్యాకు చెందిన స్పుత్నిక్ వి వ్యాక్సిన్ తొలి క‌న్‌సైన్‌మెంట్ హైద‌రాబాద్‌లో ల్యాండైంది. మాస్కో నుంచి ల‌క్షా 50 వేల డోసుల స్పుత్నిక్ వి వ్యాక్సిన్ల‌తో ఉన్న విమానం నేరుగా హైద‌రాబాద్ చేరుకుంది. మ‌రికొద్ది రోజుల్లోనే మ‌రో 30 ల‌క్ష‌ల డోసుల వ్యాక్సిన్ కూడా ఇండియాకు రానుంది.

ఈ వ్యాక్సిన్ల‌ను డాక్ట‌ర్ రెడ్డీస్ లేబొరేట‌రీస్‌కు డెలివ‌ర్ చేయ‌నున్నారు. ఇండియాలో ఈ వ్యాక్సిన్ త‌యారీకి ర‌ష్య‌న్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (ఆర్డీఐఎఫ్‌)తో చేతులు క‌లిపింది రెడ్డీస్ లేబొరేట‌రీస్‌. గ‌త నెల 13న స్పుత్నిక్ వి వ్యాక్సిన్‌కు డీసీజీఐ అనుమ‌తి ఇచ్చిన విష‌యం తెలిసిందే.