
క్వారంటైన్ ముగిసేదాకా అంతే..వ్యాక్సిన్, మాస్కు ఉంటేనే స్టాఫ్కు ఎంట్రీ
♦️15 రోజులకోసారి కొవిడ్ టెస్టు
ప్రభుత్వానికి ఆరోగ్యశాఖ ప్రతిపాదన
బడిలో ఒక రోజుఐదు కరోనా పాజిటివ్ కేసులునమోదైతే ఆ స్కూలు మూసివేయాల్సిందే అని వైద్య ఆరోగ్యశాఖ తేల్చిచెప్పింది. క్వారంటైన్ టైంపూర్తయ్యేవరకు క్లాసులు నిర్వహించవద్దనిసూచించింది. లేదంటే వైరస్ వ్యాప్తి తీవ్రత పెరిగేప్రమాదం ఉందని ప్రభుత్వానికి ప్రతిపాదించింది.
ఒకే రోజు 5 కేసులు నమోదైన పాఠశాలలను మూసివేయాల్సిందేనని వైద్యారోగ్యశాఖ తేల్చి చెప్పింది. క్వారంటైన్ టైం పూర్తయ్యే వరకు ఎట్టి పరిస్థితుల్లో క్లాసులు నిర్వహిం చొద్దని స్పష్టం చేసింది. లేదంటే వైరస్ వ్యాప్తి తీవ్రత అధికమయ్యే ప్రమాదముందని ప్రభుత్వానికి ప్రతిపా దించింది. గతేడాది అనుభవాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవాలని హెల్త్ ఆఫీసర్లు వివరించారు. పాజిటివ్ తేలిన పాఠశాలలో వెంటనే శానిటేషన్ తో పాటు ప్రతి ఒక్కరికీ కరోనా టెస్టులు నిర్వహించాలని సూచించి నట్టు తెలిపారు. ఆ మేరకు ఆరోగ్యశాఖ అన్ని రకాల ఏర్పాట్లను సిద్ధం చేసిందన్నారు. అత్యధికంగా కేసులు నమోదవుతున్న పాఠశాలలు తమను సంప్రదిస్తే కరోనా నియంత్రణ చర్యలను వేగవంతం చేస్తామని వైద్యశాఖ వివరించింది. అదే విధంగా హాస్టళ్లు, రెసిడె నియల్ సంస్థలలోని విద్యార్థులకు లక్షణాలు ఉంటే, వారిని పీహెచీసీలకు తరలించే బాధ్యత ఆయా స్కూళ్ల వార్డెన్లు, ప్రిన్సిపల్స్ దేనని హెల్త్ ఆఫీసర్లు వెల్లడిం చారు. అంతేగాక ప్రైమరీ కాంటాక్ట్లు అందరికీ టెస్టులు నిర్వహించాలన్నారు. మరోవైపు ఈ నెల 30 వరకు అన్ని స్కూళ్లను క్లీన్ చేయించాలని వైద్యశాఖ పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖలకు సూచించారు. ప్రతీ పాఠశాల ప్రవేశంలో థర్మల్ స్క్రీనింగ్. శానిటే షన్ సౌకర్యాన్ని ఏర్పాటు చేసుకోవాలని అన్ని స్కూళ్లకు ముందస్తు జాగ్రత్తలను వైద్యారోగ్యశాఖ వివ రించింది.
రెండు వారాలకోసారి టెస్టు
పాఠశాలల్లో టీచర్లు, ఇతర సిబ్బంది ప్రతీ రెండు వారా లకోసారి కరోనా టెస్టులు చేయించుకోవాలని ఆరోగ్య శాఖ సూచించింది. లక్షణాలున్న చిన్నారులకు ఎప్పటి కప్పుడు పరీక్షలు చేయాలన్నది. ఈ మేరకు అవసర మైన సౌకర్యాలను వైద్యశాఖ సమకూరుస్తుందని స్పష్టం చేసింది. జిల్లా వైద్యాధికారికి స్కూళ్ల వివరాలు ఇస్తే ప్రత్యేక టీంల ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహిస్తా రని తెలిపింది. పిల్లల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం వహించొద్దని వివరించింది.
వ్యాక్సిన్, మాస్కు మస్ట్
టీకా తీసుకున్న వారిని మాత్రమే పాఠశాల లోకి అనుమతించాలని ప్రభుత్వాన్ని వైద్యశాఖ కోరింది. పాఠశాలలోనూ మాస్కు తప్పనిసరిగా ధరించాలనే నిబంధన విధించా లని సూచించింది. పాఠశాలలకు వచ్చే టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్తో పాటు పేరెంట్స్క టీకా తప్పనిసరి చేస్తూ మార్గద ర్శకాలను జారీ చేయాలని కోరింది. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్కు ఈ నిబంధనలు వర్తించేలా చర్యలు తీసుకోవాలని చెప్పింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 6 లక్షల మంది టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్కు తమ ఆధ్వర్యంలో టీకాలు ఇచ్చినట్టు వైద్యశాఖ తెలిపింది. ఇప్పటి వరకు కనీసం ఒక్క డోసు సైతం తీసుకోని వారు వెంటనే తమను సంప్ర దించాలని హెల్త్ ఆఫీసర్లు పేర్కొన్నారు. స్కూల్స్ తెరిచే లోపు కనీసం ఒక్క డోసు అయినా తీసుకోగలిగితే కొంత వరకు రక్షణ పొందవచ్చని చెబుతున్నారు.