చాలా ఛానెళ్ళు, పేపర్లూ ఎంతటి దారుణమైన రిపోర్టింగ్ అంటే అది చదివినవాడు పొరబాటున నాకూ కరోనా వస్తే బతకనేమో అనే భయాందోళనకు గురించేసే రీతిలో ఉంటోంది, ఇది బహుశా ఇటువంటివి మనదేశంలోనే సాధ్యమేమో!
🙊🙉🙈
చితులపై శవాలు,
రోగులతో నిండిన అస్పత్రులు,
స్మశాన వాటికలవద్ద నిరీక్షస్తున్నవారు,
వీటిని చూసి భయాందోళనలో ప్రజలు.
అసలిటువంటివి మాత్రమే చూపి జనాలకి ఏం చెబుదామనుకుంటున్నారు?
ఏం చేయాలనుకుంటున్నారు ???‼️
మహమ్మారి అందరికి తెలుసూ🥸
నియంత్రణ కష్టంగా ఉంది అదీ అందరికి తెలుసు.😧
**
రిపోర్టింగ్ చేయండి, సమాచారం అందించండి, ఉదాహరణకు :
కరోనా నుండి #కోలుకున్నవారితో ఇంటర్వ్యూ లు,
ఆక్సిజన్ ఎక్కడ లభ్యమావుతోంది
ప్లాస్మా దాతల వివరాలు, లభ్యమయే చోటు ,
ఏ #ఆస్పత్రిలో బెడ్స్ అందుబాటులో ఉన్నాయి,
ప్రతి ప్రాంతంలో అందుబాటులో ఉన్న #అంబులెన్సు సర్వీస్ వివరాలు.
ఇటువంటివి అందివ్వండి, ఉపయోగకరం, అంతేకాని బ్రేకింగ్ అంటూ సంచలనమంటూ
ప్రజలను భయపెట్టేవి కావు, అది కావాల్సింది
వార్తలు ప్రజలకోసం,
కానీ ఛానెళ్ళు పనిగట్టుకుని వేరే ఉద్దేశ్యం తో పనిచేస్తున్నట్టు ఉంది.
ఆందోళనకు గురిచేసి ప్రజల ప్రాణాలమీదికి తెచ్చి వారిని కూడా పోయిన వారి జాబితాలో చేర్చాలనే తాపత్రయంతో ఏం సాధించాలనుకుంటున్నారో ???
ఇప్పటి వరకూ భారతదేశ జనాభాలో 1% పాపులేషన్ కీ మాత్రమే కరోనా వచ్చింది.
అందులో 1.5% మాత్రమే చనిపోయారు.
మిగిలిన 99.85% ప్రజలను ఈ 24/7 ఛానెల్స్ ప్రతి గంటా చంపేస్తున్నా యీ లేదా బ్రతుకుమీద విరక్తి కలిగే లా చేస్తున్నాయి