_దిల్లీ: రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం శనివారం ఎస్డీఆర్ఎఫ్ నిధులను విడుదల చేసింది.
రాష్ట్రాల విపత్తు నిర్వహణ కోసం రూ.8,873 కోట్లు విడుదలయ్యాయి.
ఇందులో ఆయా రాష్ట్రాలకు చేరే మొత్తంలో 50 శాతం నిధులను కరోనా కట్టడి చర్యలకు వాడుకోవచ్చని కేంద్రం తెలిపింది.
ఈ మేరకు ఎస్డీఆర్ఎఫ్కు తొలి విడత నిధులు విడుదల చేసినట్లు కేంద్రం స్పష్టం చేసింది.