శంషాబాద్ విమానాశ్రయంలో సుమారు అరకేజీ బంగారం పట్టుబడింది. దుబాయి నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి 495 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఫేసియల్ క్రీమ్ బాక్సు, శాండిల్స్లో దాచుకుని బంగారాన్ని తెచ్చినట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు.
