Site icon Sri Yadadri Vaibhavam

AP లో మరో పదేళ్ళ పాటు…. బీసీ రిజర్వేషన్లు పొడిగింపు.ఏపీ సీఎం జగన్ నిర్ణయం


అమరావతి నుంచి …

సచివాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర మంత్రిమండలి. పలు నిర్ణయాలు:

మరో 10 ఏళ్ల పాటు బీసీ రిజర్వేషన్లు పొడిగింపు
కోవిడ్‌ృ19 నియంత్రణకు మరింత నిర్దిష్ట చర్యలు
ప్రతి మండలంలో కోవిడ్‌ కేర్‌ సెంటర్‌ ఏర్పాటు
విరివిగా కోవిడ్‌ పరీక్షలు. 24 గంటల్లో ఫలితం
సీబీఎస్‌ఈతో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం
44,639 పాఠశాలలు దశలవారీగా అనుసంధానం
ఆయా స్కూళ్లలో ఇంగ్లిష్‌ మీడియమ్‌లో బోధన
2021ృ22లో సీబీఎస్‌ఈ సిలబస్‌తో 7వ తరగతి పరీక్షలు
2024ృ25లో అదే సిలబస్‌తో 10వ తరగతి పరీక్షలు
సహకార రంగంలోని డెయిరీల పునరుద్ధరణకు చర్యలు
వచ్చే మార్చి నాటికి రాష్ట్ర వ్యాప్తంగా అమూల్‌ పాల సేకరణ
శ్రీకాకుళం, చిత్తూరు జిల్లాలలో పశు సంవర్థక పాలిటెక్నిక్‌లు
మత సామరస్యం పెంపొందించే దిశలో మరో ముందడుగు
అర్చకులు, ఇమామ్‌లు, మౌజమ్‌లు, పాస్టర్లకు వేతనాల పెంపు
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మరింత బలోపేతం దిశగా చర్యలు
కొత్తగా 176 పీహెచ్‌సీల ఏర్పాటు. 2464 పోస్టులు మంజూరు
అసైన్డ్‌ భూములు సేకరిస్తే, ఎక్కువ పరిహారం చెల్లింపు
ఎస్‌ఆర్‌ స్టీల్‌ కంపెనీకి కడప స్టీల్‌ ప్లాంట్‌ పనుల అప్పగింత
పోలవరం, హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టుల విస్తరణ
మంత్రి మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు

మరో 10 ఏళ్ల పాటు బీసీ రిజర్వేషన్లు:

విద్యా సంస్థలు, సర్వీసుల్లో బీసీలకు (ఏ,బీ,సీ,డీ మరియు ఈ) రిజర్వేషన్లు మరో 10 ఏళ్ల పొడిగింపు. ఉద్యోగాల భర్తీలో గరిష్ట వయోపరిమితిలో 5 ఏళ్ల సడలింపు. ఆ మేరకు ఈ ఏడాది జూన్‌ 1 నుంచి 2031 మే 31 వరకు అవన్నీ వర్తింపు.

వైయస్సార్‌ రైతు భరోసాృపీఎం కిసాన్‌:

రైతులకు సాగు పెట్టుబడిలో సాయంగా ఈ ఏడాది తొలి విడతగా ఖరీఫ్‌కు సంబంధించి రైతుల ఖాతాల్లో రూ.7500 చొప్పున జమ. ఈనెల 13న ఆ సహాయం. ఆ మేరకు రైతుల ఖాతాల్లో రూ.4,050 కోట్లు జమ. ఆర్‌ఓఎఫ్‌ఆర్, వాస్తవ సాగుదారులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కౌలు రైతులకు కూడా లబ్ది.

వైయస్సార్‌ ఉచిత పంటల బీమా:

గత ఏడాది (2020) ఖరీఫ్‌కు సంబంధించి వైయస్సార్‌ ఉచిత పంటల బీమా పథకంలో క్లెయిమ్‌ల చెల్లింపు. ఈనెల 25న రైతుల ఖాతాల్లో నేరుగా రూ.2589.60 కోట్లు జమ. 35.75 లక్షల హెక్టార్ల భూమిలో పంట నష్టపోయిన రైతులకు, 2021 ఖరీఫ్‌లోనే వారికి ఉపయోగపడే విధంగా ఏ మాత్రం జాప్యం లేకుండా ప్రభుత్వం క్లెయిమ్‌ల చెల్లింపు. పూర్తి పారదర్శకత కోసం రైతు భరోసా కేంద్రాలలో లబ్ధిదారుల జాబితాల ప్రదర్శన.

వైయస్సార్‌ మత్స్యకార భరోసా:

చేపల వేట నిషేధ సమయంలో మత్స్యకార కుటుంబాలకు రూ.10 వేల ఆర్థిక సహాయం చేస్తామన్న ప్రభుత్వం ఈ ఏడాది (2021)కి సంబంధించి 1,30,456 మంది మత్స్యకారులకు రూ.130.46 కోట్లు అందజేస్తోంది. 2019లో 1.02 కోట్ల మంది మత్స్యకారులకు రూ.102 కోట్ల లబ్ధి జరిగితే, 2020లో 1.09 లక్షల మందికి రూ.109 కోట్లు ఇవ్వగా, ఈ ఏడాది 1.30 లక్షలకు పైగా మత్స్యకారులకు ఏకంగా రూ.130.46 కోట్ల సహాయం అందజేస్తున్నారు. ఈనెల 18న వైయస్సార్‌ మత్స్యకార భరోసా.

సీబీఎస్‌ఈతో ఎంఓయూ:

ఇంగ్లిష్‌ మీడియమ్‌లో విద్యాబోధనతో పాటు, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేలా సీబీఎస్‌ఈతో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకోనుంది. ఆ మేరకు రాష్ట్రంలోని 44,639 ప్రభుత్వ పాఠశాలలను దశలవారీగా అనుసంధానం చేసుకునే ప్రక్రియతో పాటు, ఇంగ్లిష్‌ మీడియమ్‌లోనే విద్యా బోధన కొనసాగుతుంది. ఉపాధ్యాయులు, హెడ్మాస్టర్లతో పాటు, విద్యా సంస్థల అధికారులు సీబీఎస్‌ఈ సిలబస్, ఆ పరీక్షలను అలవర్చుకునే విధంగా వారికి తగిన అవగాహన కల్పిస్తారు. 2021ృ22 విద్యా సంవత్సరంలో 7వ తరగతి విద్యార్థులు సీబీఎస్‌ఈ సిలబస్‌తో పరీక్షలు రాస్తే, 2024ృ25లో 10వ తరగతి విద్యార్థులు అదే సిలబస్‌తో పరీక్షకు హాజరవుతారు.
ఒకవైపు విద్యా ప్రమాణాల పెంపు, మరోవైపు నాడుృనేడుతో స్కూళ్ల రూపురేఖలు మారుతుండడంతో, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో కొత్తగా 6.12 లక్షల విద్యార్థులు చేరగా, వారిలో 4 లక్షలకు పైగా విద్యార్థులు ప్రైవేటు విద్యా సంస్థల నుంచి వచ్చిన వారు కావడం విశేషం.

‘సాల్ట్‌’ కు ప్రపంచ బ్యాంక్‌ రుణం:

‘సపోర్టింగ్‌ ఆంధ్రాస్‌ లెర్నింగ్‌ ట్రాన్సఫర్మేషన్‌’ (సాల్ట్‌)కు మంత్రి మండలి పరిపాలనాపరమైన అనుమతి ఇచ్చింది. ఈ ప్రాజెక్టు కోసం ప్రపంచ బ్యాంక్‌ నుంచి 250 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.1860 కోట్లు) రుణం సేకరిస్తుండగా, ఆ నిధులతో నాడుృనేడు కింద ప్రభుత్వ పాఠశాలల్లో పనులు పూర్తి చేస్తారు. అదే విధంగా టీచర్లకు వృత్తిపరమైన నైపుణ్యం పెంచడం, ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్‌ మీడియమ్‌ ప్రవేశపెట్టడం వంటి వాటి కోసం కూడా ఆ నిధుల వినియోగిస్తారు.

ఎయిడెడ్‌ విద్యా సంస్థల టేకోవర్‌:

ప్రభుత్వానికి అప్పగించడానికి సిద్ధంగా ఉన్న ఎయిడెడ్‌ విద్యా సంస్థలను ప్రభుత్వం టేకోవర్‌ చేస్తుంది. ఏ మాత్రం ఆర్థిక భారం పడకుండా ఆ ప్రక్రియను పూర్తి చేస్తారు. అందుకు అనుగుణంగా ఏపీ విద్యా చట్టంృ1982లో సవరణలను మంత్రి మండలి ఆమోదించింది. ఎయిడెడ్‌ విద్యా సంస్థలను టేకోవర్‌ చేయడం వల్ల ఎవరికీ నష్టం కలగదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ప్రైవేటు యూనివర్సిటీల చట్టం సవరణ:

ఏపీ ప్రైవేటు యూనివర్సిటీల చట్టంృ2016కు సవరణను కూడా మంత్రివర్గం ఆమోదించింది. ప్రైవేటు వర్సిటీలలో 35 శాతానికి మించకుండా ప్రభుత్వం కోటా ఉంటుంది. ఆ కోటాలో సీట్లు కేటాయించిన విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పాటు, స్కాలర్‌షిప్‌ కూడా ఇస్తారు. ప్రైవేటు విద్యా సంస్థలలో 35 శాతం ప్రభుత్వ కోటా వల్ల విద్యార్థులకు మరింత మెరుగైన విద్యావకాశాలు అందుబాటులోకి వస్తాయి. తద్వారా నైపుణ్యం అభివృద్ధి చెందడంతో పాటు, వారికి ఉద్యోగ అవకా«శాలు కూడా మెరుగవుతాయి.
ఇక బ్రౌన్‌ఫీల్డ్‌ ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటు వల్ల ప్రపంచ స్థాయి విద్య అందుబాటులోకి వస్తుంది. ఇంకా ఉన్నత విద్యా రంగం మరింత బలోపేతం అవుతుంది.

ఏపీడీడీసీఎఫ్‌కు తిరిగి జవసత్వాలు:

ఆంధ్రప్రదేశ్‌ పాడి అభివృద్ధి సహకార సమాఖ్య (ఏపీడీడీసీఎఫ్‌)కు తిరిగి జవసత్వాలు కలిగిస్తూ, మూతబడిన లేదా నిస్తేజంలో ఉన్న డెయిరీలు తిరిగి పనిచేసేలా చర్యలు. ఆ కోవలోనే విధంగా అమూల్‌ సంస్థతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఆ మేరకు ఇప్పటికే 4 జిల్లాలలో అమూల్‌ సంస్థ పాల సేకరణ మొదలు పెట్టగా, వచ్చే ఏడాది మార్చి నాటికి అన్ని జిల్లాలలో పాల సేకరణ చేస్తారు. ఉపయోగంలో లేని డెయిరీలను అమూల్‌కు లీజ్‌కు ఇస్తారు.

ఆ పాల సంఘానికి రూ.69 కోట్ల రుణం:

ప్రకాశం జిల్లా పాల ఉత్పత్తిదారుల సంఘానికి రూ.69 కోట్ల రుణాన్ని
ఏపీడీడీసీఎఫ్‌ ద్వారా మంజూరు చేయించేందుకు మంత్రివర్గం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. తద్వారా పాడి మహిళా రైతులకు చేయూత ఇవ్వనున్నారు. వరసగా నష్టాలబాట పట్టిన ఈ సంఘం, చివరకు ఉత్పాదక సామర్థ్యంలో కనీసం 10 శాతం కూడా పని చేయలేకపోతోంది. ఈ నేపథ్యంలో సంఘాన్ని పునరుజ్జీవింప చేయడం కోసం ఈ రుణాన్ని సమకూరుస్తున్నారు. దీంతో సంఘం బాకీలన్నీ తీర్చడంతో పాటు, డెయిరీ ప్లాంట్‌కు అవసరమైన మరమ్మతులు చేస్తారు.

పశుసంవర్థక పాలిటెక్నిక్‌లు:

శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం వెన్నెలవలసలో 30 ఎకరాలలో పశు సంవర్థక పాలిటెక్నిక్‌ కళాశాల ఏర్పాటు. తిరుపతిలోని ఎస్వీ వెటర్నరీ వర్సిటీకి అనుబంధంగా కళాశాల. రూ.9.55 కోట్ల బడ్జెట్‌ కేటాయింపు.
జిల్లాలో వ్యవసాయం ఎక్కువ. అలాగే పాడి, మేకలు, గొర్రెల పెంపంపైనే చాలా మంది ఆధారపడి జీవిస్తుండడంతో, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపర్చడం కోసం జిల్లాలో ఈ పాలిటెక్నిక్‌ కళాశాల ఏర్పాటు చేస్తున్నారు.
అదే విధంగా చిత్తూరు జిల్లా సొదుమ్‌ మండల కేంద్రంలో కూడా పశుసంవర్థక పాలిటెక్నిక్‌ కళాశాల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందుకోసం రూ.9.55 కోట్ల బడ్జెట్‌ కేటాయించనున్నారు.
జిల్లాలో కూడా పాడి ఎక్కువ కావడంతో సుదుంలో కొత్తగా పశు సంవర్థక పాలిటెక్నిక్‌ కళాశాలను ఏర్పాటు చేస్తున్నారు.

మత సామరస్యం కోసం..:
దైవ చింతన, పరమత సహనం, మత సామరస్యం వెల్లివిరిసేలా అన్ని మతాలను సమానంగా గౌరవిస్తూ అర్చకులు, ఇమామ్‌లు, మౌజమ్‌లు, పాస్టర్లకు ఇచ్చే గౌరవ వేతనాలు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఆ మేరకు ఎృకేటగిరీ అర్చకులకు 10 వేల నుంచి రూ.15,625. బిృకేటగిరీ అర్చకులకు రూ.5 వేల నుంచి రూ.10 వేలు. ఇమామ్‌లకు రూ.5 వేల నుంచి రూ.10 వేలు. మౌజమ్‌లకు రూ.3 వేల నుంచి రూ.5 వేలు. పాస్టర్లకు రూ.5 వేల గౌరవ వేతనాలు చెల్లిస్తారు.

ఉయ్యాలవాడ పేరు:

ఆనాడు రాష్ట్రంలో తొలి స్వాతంత్య్ర సమరయోధుడిగా పేరు పొందిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని కీర్తిస్తూ, కర్నూలు ఓర్వకల్లు ఎయిర్‌పోర్ట్‌ పేరును ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎయిర్‌పోర్ట్, కర్నూలుగా మార్పు చేస్తూ క్యాబినెట్‌ నిర్ణయం తీసుకుంది.

ఆ భూములకు ఎక్కువ పరిహారం:

ఇప్పటివరకూ ప్రభుత్వం ఎక్కడైనా భూసేకరణ చేయదలుచుకుంటే పట్టాదారు రైతుకు ఎంత పరిహారం ఇస్తారో అసైన్డ్‌ రైతుకు కూడా సమాన పరిహారాన్ని ఇచ్చే విధంగా ప్రభుత్వం అమలుచేస్తుంది. ఎన్నికల హమీలో ఇచ్చిన మాట మేరకు ప్రభుత్వం ఎక్కడైనా భూసేకరణ చేస్తే అక్కడ ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన అసైన్డ్‌ భూమిని గత్యంతరం లేక సేకరించాల్సి వస్తే రైతు వారీ పట్టాకిచ్చే భూమి విలువ కంటే 10 శాతం అదనంగా ఎస్సీ, ఎస్టీ అసైన్డ్‌ రైతులకు చెల్లించేలా మంత్రిమండలి తీర్మానం చేసింది.

ప్రొద్దుటూరు ఇంజనీరింగ్‌ కాలేజీకి రూ.66 కోట్లు:

యోగి వేమన యూనివర్సిటీకి అనుబంధంగా ప్రొద్దుటూరులో ఉన్న వైయస్సార్‌ ఇంజనీరింగ్‌ కళాశాల అభివృద్ధి. మొదటి దశలో రూ.66 కోట్లతో పనులు. ఇందులో రెండు టీచింగ్‌ పోస్టులు, ఔట్‌ సోర్సింగ్‌ విధానంలో ఆరు నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీ. ఇంకా వేంపల్లిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు కోసం రూ.20 కోట్లు మంజూరు.

గ్రామీణ ఆరోగ్య వ్యవస్థ బలోపేతం:

గ్రామీణ ఆరోగ్య వ్యవస్థ బలోపేతం అయ్యేలా రాష్ట్రంలో కొత్తగా 176 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఏర్పాటు. ఇంకా కొత్తగా 2464 పోస్టుల మంజూరు చేస్తూ మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం మొత్తం రూ.511.79 కోట్ల వ్యయాన్ని అంచనా వేస్తున్నారు. ప్రతి మండలంలో రెండు పీహెచ్‌సీలు లేదా పీహెచ్‌సీ, ఒక సీహెచ్‌సీ (కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌) ఉండాలని, ఇంకా ప్రతి ఏజెన్సీ మండలానికి మూడు పీహెచ్‌సీలు ఉండాలని నిర్ణయించారు. ప్రతి పీహెచ్‌సీకి ఒక ఒక 104 వాహనాన్ని అటాచ్‌ చేస్తారు. వీటన్నింటితో ప్రతి మండలంలో నలుగురు డాక్టర్లు, 104 లో మరో ఇద్దరు చొప్పున మొత్తం 6గురు ఉంటారు, ఈ నిర్ణయం వల్ల ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ అందుబాటులోకి వస్తుంది. మారుమూల గ్రామంలో కూడా మంచి వైద్యం అందించవచ్చని ప్రభుత్వం విశ్వసిస్తోంది.

పరిశ్రమలుృపెట్టుబడులు:

శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేట ఇండస్ట్రియల్‌ పార్క్‌లో గ్రీన్‌లామ్‌ సౌత్‌ ఇండియా లిమిటెడ్‌కు 66.49 ఎకరాలు భూమి కేటాయింపు. ఎకరం రూ.67,01,830 చొప్పున కేటాయింపు. అక్కడ ఆ సంస్థ మొత్తం 595 కోట్లు పెట్టుబడి పెట్టనుండగా, ప్రత్యక్షంగా 400 మందికి, పరోక్షంగా మరో 450 ఉపాధి లభించనుంది.
ఇంకా బెస్టెక్‌ ఫుట్‌వేర్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఆడిడాస్‌) (ఇంటెలిజెంట్‌ ఎస్‌ఈజెడ్‌ డెవలప్‌మెంట్‌ లిమిటెడ్, హాంకాంగ్‌) వారికి ఫ్రీ హోల్డ్‌ రైట్స్‌పై మంత్రివర్గం నిర్ణయం. అంటే వారికి నిర్ద్ధేశించిన టార్గెట్‌ మేరకు ఉద్యోగాల కల్పన, పెట్టబడులు పెట్టాలి. పులివెందుల వద్ద రూ.70 కోట్లు, చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం ఇనగలూరు వద్ద మరో రూ.700 కోట్లు పెట్టుబడి. తద్వారా పులివెందులలో 2 వేల మందికి, ఇనగలూరు వద్ద 10 వేల మందికి ఉపాధి కల్పన.

ఎస్‌ఆర్‌ స్టీల్‌కు కెఎస్‌ఎఫ్‌:

కడప స్టీల్‌ ఫ్యాక్టరీ పనులను ఎస్‌ఆర్‌ స్టీల్స్‌కు అప్పగించాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అంతకు ముందు ఆ బాధ్యతలు అప్పగించిన లిబర్టీ కంపెనీ నష్టాలపాలు కావడంతో, కడప స్టీల్‌ ఫ్యాక్టరీ పనులు ఎస్‌ఆర్‌ స్టీల్స్‌కు అప్పగించనున్నారు.

కృష్ణపట్నం నోడ్‌లో సదుపాయాలు:

చెన్నైృబెంగళూరు, హైదరాబాద్‌ృబెంగళూరు ఇండస్ట్రియల్‌ కారిడార్ల (సీబీఐసీ)లో భాగంగా ఉన్న కృష్ణపట్నం నోడ్‌లో రూ.1,448 కోట్లతో మౌలిక సదుపాయాల కల్పనకు పరిపాలనా అనుమతులు మంజూరు. సీబీఐసీలో కృష్ణపట్నం నోడ్‌ కీలకం కానుంది. అక్కడ మొత్తం రూ.2139.44 కోట్ల పెట్టుబడిని అంచనా వేస్తుండగా, 2040 నాటికి 10 లక్షల ఉద్యోగావకాశాలు వస్తాయని భావిస్తున్నారు.

మార్కెట్‌ యార్డుకు భూమి:

చిత్తూరు జిల్లా ఎస్‌ఆర్‌ పురం మండలం కొటార్లపల్లిలో 4.52 ఎకరాల భూమిని వ్యవసాయ మార్కెట్‌ యార్డు నిర్మాణం కోసం కేటాయిస్తూ మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది.

విశాఖలో టూరిజమ్‌:

టూరిజం అభివృద్దిలో భాగంగా విశాఖపట్నం కైలాసగిరి నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ వరకూ మధ్య ఉన్న ప్రాంతాన్ని అభివృద్ది చేసే ప్రణాళికకు ఆమోదం. ఈ 19 కిలోమీటర్ల దూరం మొత్తం కూడా ఆరు నుంచి ఎనిమిది వరసల రహదారి నిర్మాణం, ఈ 19 కిలోమీటర్ల మధ్యలో 12 వివిధ రకాల ప్రాజెక్ట్‌లు ఏర్పాటు. అందులో కైలాసగిరి వద్ద ఐదు ఎకరాల్లో స్కైటవర్‌ నిర్మాణం, బంగ్లాదేశ్‌ నౌక ఎంవీ మా ను ప్రభుత్వమే తీసుకుని ఫ్లోటింగ్‌ రెస్టారెంట్‌ ఏర్పాటు, అక్వేరియం టన్నెల్‌ ఏర్పాటు, కైలాసగిరి నుంచి భోగాపురం వరకూ 11 బీచ్‌లను అభివృద్ది చేయాలని, దీంతోపాటు వివిధ రకాల 12 ప్రాజెక్ట్‌లను టూరిజం ద్వారా అభివృద్ది చేసే ప్రణాళికకు క్యాబినెట్‌ ఆమోదం.

హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ పనులు:

హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టు (హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌) విస్తరణ. ప్రాజెక్టు ఫేజ్‌ృ1 పనుల్లో భాగంగా ప్రధాన కాలువ విస్తరణ మరియు లైనింగ్‌ పనులకు పరిపాలనా అనుమతులు మంజూరు. తద్వారా కాలువలో నీటి విడదల సామర్థ్యం 6300 క్యూసెక్కులకు పెంపు. ఇంకా అదనపు పంప్‌హౌజ్‌ల నిర్మాణం. మొత్తం రూ.6182 కోట్లు వ్యయం అంచనా.
అదే విధంఆ ప్రాజెక్టు రెండో దశ (ఫేజ్‌ృ2) పనులకు సంబంధించి సవరించిన అంచనాలకు పరిపాలనా అనుమతులు మంజూరు. ఆ మేరకు రూ.9318,14 కోట్లు సవరించిన అంచనాలకు మంత్రివర్గం ఆమోదం.

పోలవరం ప్రాజెక్టు:

పోలవరం ప్రాజెక్టులో డెడ్‌ స్టోరేజీ స్థాయిలో (32 మీ) కూడా నీటిని తోడే ప్రాజెక్టుకు ఆమోదం. ఆ మేరకు ప్రాజెక్టు కుడివైపున పంప్‌హౌస్‌. ఎలక్ట్రిక్‌ సబ్‌ స్టేషన్‌తో పాటు, ఇతర నిర్మాణాలు. అంచనా వ్యయం రూ.912 కోట్లు.
కాల్వల లింక్‌:
ఏలేరు తాండవ కాల్వల లింక్‌ ప్రాజెక్టుకు పరిపాలనాపరమైన అనుమతి. రూ.470.05 కోట్ల వ్యయం అంచనా. దీని ద్వారా 5600 ఎకరాలకు స్థిరమైన సాగునీరు సరఫరా. తద్వారా మొత్తం 51,465 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ.
పల్నాడు ప్రాజెక్టు:
వైయస్సార్‌ పల్నాడు కరవు నివారణ ప్రాజెక్టులో భాగంగా ఎలక్ట్రో మెకానిక్‌ పనులు, ట్రాన్స్‌మిషన్‌ పనులతో పాటు, ఇతర సివిల్‌ పనుల కోసం రూ.2746 కోట్ల రుణం సేకరణకు మంత్రి మండలి అనుమతి.

ఏపీ ఎలక్ట్రానిక్స్‌ పాలసీ:

ఎలక్ట్రానిక్స్‌ మ్యాన్యుఫ్యాక్చరింగ్‌ ఇండస్ట్రీ అభివృద్దిలో భాగంగా ఏíపీ ఎలక్ట్రానిక్స్‌ పాలసీ 2021ృ24 కు క్యాబినెట్‌ ఆమోదం.ఎలక్ట్రానిక్‌ ఉపకరణాల ఉత్పత్తి, వాటి పరిశోధన, అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. దీంతో ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తి రంగం రాష్ట్రంలో శర వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రస్తుతం ఈ రంగం విలువ 104 అమెరికన్‌ బిలియన్‌ డాలర్లు కాగా, 2025 నాటికి అది 400 అమెరికన్‌ బిలియన్‌ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. ప్రభుత్వం ఇప్పుడు ఆమోదించిన కొత్త పాలసీ, ఈ రంగంతో మరిన్ని పెట్టుబడులను ఆకర్షించనుంది.
ఇంకా ప్రపంచస్థాయి గ్రీన్‌ఫీల్డ్‌ ఎలక్ట్రానిక్స్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్‌.. వైయస్సార్‌ ఈఎంసీని వైయస్సార్‌ కడప జిల్లా కొప్పర్తి వద్ద అభివృద్ధి చేస్తున్నారు. ఈ రంగం (ఎలక్ట్రానిక్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌)లో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల ప్రత్యక్షంగా 39 వేల మందికి ఉపాధి లభించనుంది.

పశుగ్రాస భధ్రతా పాలసీ 2021ృ2026:

పశుగ్రాస కొరతను తీర్చడమే లక్ష్యంగా పశుగ్రాస భద్రతా పాలసీ 2021ృ2026ను రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. టెక్నాలజీని ఉపయోగించుకుని ఫాడర్‌ మరియు ఫీడ్‌ ఉత్పత్తి పెంచడం. ఇప్పటికే ఈ పాలసీని తమిళనాడు, కర్నాటక, ఉత్తరప్రదేశ్, గుజరాత్‌ రాష్ట్రాలు అమలుచేస్తున్నాయి. ఆయా రాష్ట్రాలలో అమలవుతున్న పాలసీని పరిశీలించిన మీదట మరింత ప్రయోజనకరంగా రూపొందించిన కొత్త పాలసీకి క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది.
పాలసీ ప్రత్యేకతలు
రాష్ట్ర ప్రభుత్వం నేరుగా ఏపీ స్టేట్‌ సీడ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్, నేషనల్‌ సీడ్‌ కార్పొరేషన్‌లతో ఒప్పందం చేసుకుని రైతుల భూముల్లోనే సర్టిఫైడ్‌ విత్తనాలు పండించడంతో పాటు పశుసంవర్ధక శాఖ భూముల్లో కూడా ఇదే విధానాన్ని అనుసరించడం. ఇంకా గుర్తించబడిన ఏజెన్సీల ద్వారా బ్రీడర్‌ సీడ్‌ లేదా ఫౌండేషన్‌ సీడ్‌ లేదా సోర్స్‌ సీడ్‌ను రైతులకు ఇచ్చి వారి పర్యవేక్షణలో సర్టిఫైడ్‌ సీడ్‌ను పండించడం. అలాగే నేరుగా రైతులే కాంట్రాక్ట్‌ ఫార్మింగ్‌పై ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడంతో పాటు, 75 శాతం సబ్సిడీతో ప్రైవేట్‌ ఏజెన్సీల నుంచి సర్టిఫైడ్‌ విత్తనాలను కొనుగోలు చేయడం, ఆర్‌బీకేల ద్వారా రైతులకు అందించడం జరుగుతాయి.

కోవిడ్‌ృ19 నియంత్రణ. నివారణ:

రాష్ట్రంలో తీవ్ర సమస్యగా మారుతున్న కోవిడ్‌ృ19 నియంత్రణ, నివారణపైనా మంత్రివర్గం చర్చించింది. కోవిడ్‌ పరీక్షలు మరింత ముమ్మరంగా చేయాలని, ప్రతి పరీక్ష ఫలితాన్ని 24 గంటల్లోనే తెలిసేలా చర్యల చేపట్టనున్నారు. అన్ని కోవిడ్‌ ఆస్పత్రులలో ఇంజక్షన్లు, ఆక్సీజన్‌ కొరత లేకుండా చూడాలని, ఆ మేరకు అన్ని చర్యలు తీసుకోవాలని మంత్రి మండలి తీర్మానించింది. వీటితో పాటు, మండలానికి ఒక కోవిడ్‌ కేర్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలని కూడా మంత్రివర్గం నిర్ణయించింది.
కోవిడ్‌ వాక్సిన్‌ తగినంత సరఫరా లేనందువల్ల తొలుత 45 ఏళ్లు దాటిన వారందరికీ వేసిన తర్వాతనే 18ృ45 ఏళ్ల మధ్య వయసు వారికి డోస్‌ ఇవ్వాలని మంత్రివర్గం తీర్మానించింది. కోవిడ్‌ వాక్సిన్లు మరిన్ని కేటాయించేలా కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలని కూడా మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు.

Exit mobile version