హైదరాబాద్…. తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది.
రాష్ట్రంలో సోమవారం రాత్రి 8 గంటల వరకు 70,961 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 6,876 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
దీంతో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 4,63,361కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది.
రాష్ట్రంలో నిన్న కరోనాతో 59 మంది మరణించారు. దీంతో కరోనాతో ఇప్పటి వరకు మృతిచెందిన వారి సంఖ్య 2,476కి చేరింది.
ప్రస్తుతం రాష్ట్రంలో 79,520 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. జీహెచ్ఎంసీ పరిధిలో మరో 1029 కేసులు నమోదయ్యాయి.