పాత శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం యాదగిరిగుట్టకు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న అత్యంత పురాతమైన ఈ దేవాలయాన్ని యాదాద్రి దేవస్థానం దత్తత తీసుకుని అభివృద్ధి చేసింది. ప్రతిరోజు యాదాద్రిని దర్శించిన భక్తులు పాతగుట్టను కూడా దర్శించుకుంటున్నారు. ఏటా రెండు కోట్ల రూపాయల ఆదాయం ఆర్జించే స్ధాయికి ఆలయం చేరుకున్నది. వ్రతపూజలు, నిత్యకల్యాణాలు యాదాద్రిలో జరిగే అన్ని పూజలు పాతగుట్టలో జరుగుతున్నాయి. పెండ్లిల్ల దేవునిగా పాతగుట్ట ప్రసిద్ధి చెందింది. ఎవరైనా పెండ్లి కానివారు ఇక్కడికి వచ్చి పూజలు చేసి పెండ్లి కావాలని మొక్కుకుంటే తథాస్తు అంటూ శ్రీలక్ష్మీనరసింహుడు దీవిస్తాడని తిరిగి కొత్త పెండ్లి జంట ఇక్కడికి వచ్చి పూజలు చేసి మొక్కులు తీర్చుకుంటారు. దాంతో పాతగుట్టకు పెండ్లిల్ల దేవునిగా పేరు వచ్చింది.