రైతులు భీమా కోసం ఈ నెల11వరకు దరఖాస్తు చేసుకోవాలి. గుట్ట ఏవో రాజేష్ కుమార్

0
132

యాదాద్రి బ్యూరో, ఆగస్టు 6:

కొత్తగా భూమి రిజిస్టర్ చేసుకున్న రైతులు మరియు ఇంతకుముందు రైతు భీమా చేసుకోని రైతులు ఈ సంవత్సరం రైతు భీమా (రైతు మరణిస్తే వచ్చే 5 లక్షల భీమా) చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించిందని యాదగిరిగుట్ట మండల వ్యవసాయ అధికారి కంచర్ల రాజేశ్బుకుమార్ తెలిపారు. రైతులు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

నియమ నిబంధనలు ఇలా ఉన్నాయని చెప్పారు.

▪️రైతు భూమి 03.08.2021 లోపు రిజిస్టర్ చేసుకొని ఉండాలి.

▪️రైతులు 18 నుండి 59 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి. అంటే 14.08.1962 నుండి 14.08.2003 మధ్య జన్మించి ఉండాలి.

▪️వయస్సు పక్కాగా ఆధార్ కార్డ్ ప్రకారమే తీసుకుంటారు. అందులో ఎలా ఉంటే అదే ప్రామాణికం.

▪️ఎన్ని చోట్ల భూమి ఉన్నా ఒక ఊరిలో మాత్రమే భీమాకు అవకాశం ఉంటుంది.

▪️రైతే స్వయంగా వచ్చి నామినేషన్ ఫారం మీద సంతకం చేసి భూమి పాస్ పుస్తకం, ఆధార్ కార్డ్, నామినీ ఆధార్ కార్డ్ జిరాక్స్ AEO కు అందజేయాలి.

▪️AEO మరియు MAO లు వాళ్ళ లాగ్ ఇన్ నుండి 12.08.2021 లోపే LIC కి పంపాలి. కావున రైతులు 11.08.2021 లోపే అప్లికేషన్ ఇవ్వాలి. అప్పుడే వాళ్ళవి ఆన్లైన్ చేయడానికి వీలు అవుతుంది.

▪️ఇప్పుడు మీరు భీమా చేసుకోకపోతే ఇంకో సంవత్సరం వరకు భీమా చేసుకోవడానికి అవకాశం ఉండదు.

ఇట్లు….
వ్యవసాయా అధికారి….